
పట్టణంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న 5వ జాతీయ దివ్యాంగుల చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ చెస్ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 106 మంది దివ్యాంగులు హాజరై తమ ప్రతిభను చూపించారు. ఈ పోటీలు శనివారంతో ముగియనున్నాయని చదరంగం అసోసియేషన్ కార్యదర్శి జ్వాలాముఖి తెలిపారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.